Trending news

TTD: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇకపై లడ్డూ కావాలంటే అది తప్పనిసరి

[ad_1]

ప్రస్తుతం పని ఏదైనా.. ప్రభుత్వ పథకాలు ఏవైనా అధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇలాంటి తరుణంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూ జారీ విధానంలో పలు మార్పులు తెచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు లడ్డూ కావాలంటే ఆధార్ తప్పనిసరిగా చూపించాలని తెలిపింది. ఆధార్ కార్డు సమర్పించే భక్తుడికి ఒక లడ్డూకు, మరో లడ్డూ అదనంగా ఇవ్వనున్నట్టు టీటీడీ పేర్కొంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం మిస్ యూజ్ అవుతోందని భావించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

గురువారం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటన పెద్ద వివాదానికి దారి తీయగా.. ఆధార్ కార్డుతో లడ్డూ విక్రయాలు చేస్తున్న టీటీడీ తీరుపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో శ్రీవారి భక్తులు అడిగినన్ని లడ్డూలు టీటీడీ ఇస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు రద్దీ సమయంలో లడ్డూ విక్రయాలపై ఆంక్షలు విధించింది. కాగా, ప్రస్తుతం రోజూ దాదాపు 3.50 లక్షల లడ్డూలు టీటీడీ విక్రయిస్తోంది.

ఇది చదవండి: ఆదివారం వచ్చిందంటే ఆ గ్రామంలో నాన్-వెజ్ బంద్.. కారణం తెలిస్తే

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

[ad_2]

Related Articles

Back to top button
Close
Close