Trending news

Sachin Tendulkar: కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

[ad_1]

  • కోచ్ రమాకాంత్ అచ్రేకర్‌కు అంకితం చేసిన స్మారక చిహ్నం ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం.
  • అచ్రేకర్ తన కెరీర్‌లో ఒకే ఒక్క ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు
  • కానీ కోచింగ్‌లో విజయవంతమయ్యాడు.
Sachin Tendulkar: కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

Sachin Tendulkar and Ramakant Achreka: సచిన్ టెండూల్కర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్‌కు అంకితం చేసిన స్మారక చిహ్నం ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ముంబైలోని ప్రసిద్ధ శివాజీ పార్క్‌ లోని గేట్ నంబర్ 5 వద్ద స్మారక చిహ్నం నిర్మించడానికి ఆమోదించింది. దీని నిర్వహణ బాధ్యతను బివి కామత్ మెమోరియల్ క్రికెట్ క్లబ్‌కు అప్పగించారు. అయితే ఇందుకు ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహకారం అందించదు. శివాజీ పార్క్ జింఖానా అసిస్టెంట్ సెక్రటరీ సునీల్ రామచంద్రన్ స్మారక కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సంద్రాభంగా రామచంద్రన్ మాట్లాడుతూ.. ముంబైలో ప్రస్తుతానికి గొప్ప కోచ్ లేడు. అచ్రేకర్ సార్ భారతదేశానికి 13 మంది క్రికెటర్లను అందించాడు. సచిన్ టెండూల్కర్ కారణంగా అతను మరింత కీర్తిని పొందాడు. ఇప్పుడు ఉన్న కోచ్ లలో అతనింత దృఢనిశ్చయంతో ఎవరూ లేరు. మేము ఈ ప్రాజెక్ట్‌ను గత 3 సంవత్సరాలుగా అనుసరిస్తున్నాము. ఇందుకు MNS చీఫ్ రాజ్ థాకరే మాకు చాలా మద్దతు ఇచ్చారని ఆయన తెలిపారు.

No ODI Century: వన్డే క్రికెట్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేని దిగ్గజ బ్యాట్స్‌మెన్స్ ఎవరో తెలుసా..?

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సచిన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి అతను X లో.. అచ్రేకర్ సర్ నా జీవితంతో పాటు చాలా మంది జీవితాలపై చాలా ప్రభావం చూపారు. నేను వారి విద్యార్థులందరి తరపున మాట్లాడుతున్నాను. అతని జీవితం శివాజీ పార్క్‌లో క్రికెట్ చుట్టూ తిరిగింది. ఎప్పుడూ శివాజీ పార్క్‌ లో నివసించాలనేది అతని కోరిక. అచ్రేకర్ సార్ విగ్రహాన్ని ఆయన పని ప్రదేశంలో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నానని రాసుకొచ్చారు.

Purushothamudu OTT: ఓటీటీలోకి వచ్చేసిన పురుషోత్తముడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

ఇకపోతే అచ్రేకర్ తన కెరీర్‌లో ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. కానీ, కోచింగ్‌లో చాలా విజయవంతమయ్యాడు. సచిన్‌ తో పాటు అజిత్ అగార్కర్, చంద్రకాంత్ పండిట్, వినోద్ కాంబ్లీ, రమేష్ పొవార్, ప్రవీణ్ ఆమ్రే వంటి ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చిన అచ్రేకర్‌ కు 1990లో ద్రోణాచార్య అవార్డు లభించింది. దీని తర్వాత 2010లో, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఆమెకు క్రీడా రంగంలో పద్మశ్రీ అవార్డు లభించింది. అతను 87 సంవత్సరాల వయస్సులో 2019 లో మరణించాడు. ఇకపోతే ప్రతి గురు పూర్ణిమకు సచిన్ తన గురువు ఇంటికి వెళ్లేవాడు. ఈ సమయంలో, అతను అచ్రేకర్ నుండి శిక్షణ పొందిన తన తోటి ఆటగాళ్ళలో ఒకరిని కూడా వెంట తీసుకెళ్లేవాడు. గురు పూర్ణిమ రోజున సచిన్ ఉద్వేగానికి లోనవడం, తన కెరీర్ మొత్తం విజయానికి సంబంధించిన క్రెడిట్‌ను తన గురువు అచ్రేకర్‌కు సోషల్ మీడియాలో ఇవ్వడం తరచుగా కనిపిస్తుంది. అచ్రేకర్ అంత్యక్రియలకు సచిన్ కూడా భుజం ఎత్తాడు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close