Periods Pain Relief tips: పీరియడ్స్లో వేడి నీళ్లు తాగితే ఈ సమస్యలన్నీ తగ్గుతాయట!

[ad_1]
పీరియడ్స్ అనగానే మహిళల ముఖాలు ఒక్కసారిగా డీలా పడిపోతాయి. పీరియడ్స్ వచ్చిన మూడు లేదా ఐదు రోజులు మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బ్లీడింగ్ ఎక్కువ అవుతూ, కడపులో నొప్పులు, కండరాల నొప్పులు, నీరసం, చికాకు అబ్బో ఒక్కటేంటి చాలానే ఉంటాయి.
అయితే నెలసరి సమయంలో వేడి నీళ్లు తాగడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లు తాగడం వల్ల మీరు హైడ్రేట్గా ఉంటారు. అలాగే కడుపు ఉబ్బరం, నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
చాలా మంది పీరియడ్స్ సమయంలో జీర్ణ క్రియ సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి వారు గోరు వెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణ క్రియ, కడుపు సంబంధిత సమస్య నుంచి రిలీఫ్ అవుతారు. ప్రేగులకు విశ్రాంతి కూడా లభిస్తుంది.
తిమ్మిర్ల సమస్య నుంచి కూడా ఉపశమనాన్ని అందుకుంటారు. అలాగే కండరాల వాపులను తగ్గించడంలో కూడా వేడి నీళ్లు సహాయ పడతాయి. శరీరంలోని మలినాలు, విష పదార్థాలను బయటకు పంపించి.. బాడీని డీటాక్సీ ఫై చేస్తుంది.
అంతే కాకుండా ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక స్థితి చురుగ్గా ఉండేలా చేస్తుంది. బ్లీడింగ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మూత్ర విసర్జన సమస్యలు, యోనిలో మంట, నొప్పిని కూడా తగ్గిస్తుంది. అలాగే చర్మ సమస్యలను కూడా కంట్రోల్ చేస్తుంది.
[ad_2]