Trending news

Nobel Peace Prize : గాజా దురాగతాలు చూపిన నలుగురు జర్నలిస్టులకు నోబెల్ ప్రైజ్ ?

[ad_1]

Nobel Peace Prize : గాజా దురాగతాలు చూపిన నలుగురు జర్నలిస్టులకు నోబెల్ ప్రైజ్ ?

Nobel Peace Prize : గాజా యుద్ధంలో భయంకరమైన పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్ సైన్యం చర్యలను, గాజా పౌరుల దయనీయ స్థితిని తమ జర్నలిజం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన గాజాకు చెందిన నలుగురు జర్నలిస్టులు ఈసారి నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఈ ఏడాది నోబెల్ బహుమతి విజేతలను అక్టోబర్ 10న ప్రకటిస్తారు. నోబెల్ ప్రైజ్ ఆరు విభిన్న రంగాలలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. గత సంవత్సరంలో మానవాళికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చిన వ్యక్తులకు ఇది ఇవ్వబడుతుంది.

ఫోటో జర్నలిస్ట్ మోతాజ్ అజైజా, టీవీ రిపోర్టర్ హింద్ ఖోద్రీ, జర్నలిస్ట్ కార్యకర్త బిసాన్ ఔదా, గాజాకు చెందిన సీనియర్ రిపోర్టర్ వేల్ అల్-దహదౌహ్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణను కవర్ చేసినందుకు నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు.

Read Also:AP Crime: ఏపీలో ప్రేమ జంట ఆత్మహత్య.. రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నారు..

గాజాలో జరిగిన దారుణాలను ప్రపంచానికి చాటి చెప్పినందుకు 2024 నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యానని అజీజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నా ప్రజలు ఇప్పుడు శాంతిని పొందుతారని ఆశిస్తున్నామని వారు తెలిపారు. యుద్ధానికి ముందు.. అజీజా పోస్ట్‌లు గాజా దైనందిన జీవితాన్ని, అందాన్ని ప్రతిబింబిస్తాయి.. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఆమె యుద్ధాన్ని కవర్ చేయడం ప్రారంభించింది. ఇది ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించింది.

నోబెల్ అవార్డు 2024
నార్వేజియన్ నోబెల్ కమిటీ 2024 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతికి 285 నామినేషన్లు చేసింది. ఇందులో 196 వ్యక్తులు, 89 సంస్థలు ఉన్నాయి. ఈ సంవత్సరం నామినేషన్‌లో శాంతి వర్గానికి ప్రత్యేక వ్యక్తులు ఎంపిక చేయబడ్డారు. ఇందులో గాజా, ఉక్రెయిన్‌తో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న సంఘర్షణతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారు.

Read Also:Bengal BJP: మమతా బెనర్జీ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకోవాలని బీజేపీ డిమాండ్..!



[ad_2]

Related Articles

Back to top button
Close
Close