Trending news

Jay Shah: క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌ నుండి ఐసీసీ అధ్యక్షుడిగా ప్రయాణం ఇలా..

[ad_1]

  • మంగళవారం (ఆగస్టు 27) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కొత్త ఛైర్మన్‌గా జై షా నియమితులయ్యారు.
  • 35 ఏళ్ల షా అతి పిన్న వయస్కుడిగా ఐసీసీ అధ్యక్షుడిగా నిలిచారు.
Jay Shah: క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌ నుండి ఐసీసీ అధ్యక్షుడిగా ప్రయాణం ఇలా..

Jay Shah: మంగళవారం (ఆగస్టు 27) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కొత్త ఛైర్మన్‌గా జై షా నియమితులయ్యారు. 35 ఏళ్ల షా అతి పిన్న వయస్కుడిగా ఐసీసీ అధ్యక్షుడిగా నిలిచారు. అతను గ్రెగ్ బార్క్ లే స్థానంలో కొనసాగనున్నాడు. డిసెంబర్ 1 నుండి తన పదవీకాలం ప్రారంభమవుతుంది. గ్లోబల్ క్రికెట్ బాడీకి అధిపతి అయిన ఐదవ భారతీయుడుగా జై షా చేరాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఆయన ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం. షా ప్రస్తుత భారతదేశ హోం మంత్రి అమిత్ షా కుమారుడు. అతను సెప్టెంబర్ 22, 1988 న జన్మించాడు. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా అతని కెరీర్ 2009 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ తర్వాత తొలిసారిగా అహ్మదాబాద్‌ లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా మారాడు. నాలుగు సంవత్సరాల తరువాత, 2013 లో అతను గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) జాయింట్ సెక్రటరీ అయ్యాడు. ఆ సమయంలో అతని తండ్రి అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.

KTR Viral Tweet: ప్రజాపాలన కాదు ఇది.. ప్రతీకార పాలన.. కేటీఆర్‌ ట్వీట్ వైరల్‌

షా 2015లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బోర్డు బీసీసీఐలో తన పనిని ప్రారంభించాడు. నిజానికి, 2015 సంవత్సరంలో అతను బీసీసీఐ ఫైనాన్స్, మార్కెటింగ్ కమిటీలో మెంబెర్ గా ఉన్నారు. ఆ తర్వాత 2019లో అతను బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అతను సెప్టెంబర్ 2019లో GCA జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశాడు. సెక్రటరీ అయిన తర్వాత అతను సౌరవ్ గంగూలీ, రోజర్ బిన్నీతో కలిసి పనిచేశాడు. జనవరి 2021లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తర్వాత షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)కి కొత్త అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత 32 ఏళ్ల వయసులో ACC పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుడైన అడ్మినిస్ట్రేటర్ అయ్యాడు. షా నాయకత్వంలో, ACC సీనియర్ పురుషుల జట్లతో పాటు అండర్-19 ఆసియా కప్‌ను కూడా నిర్వహించింది. యూఏఈలో జరిగిన ఈ టోర్నీలో బంగ్లాదేశ్ విజేతగా నిలిచింది.

PM Modi’s US Tour: న్యూయార్క్‌లో ప్రధాని మోడీ మెగా ఈవెంట్‌.. భారీ స్పందన

2022లో షా హయాంలో, బోర్డు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కులను రూ.48,390 కోట్లకు విక్రయించింది. IPL తర్వాత ఇంగ్లీషు ప్రీమియర్ లీగ్ (EPL)ని ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ లీగ్‌గా అవతరించింది. ఇకపోతే కేవలం అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) మాత్రమే ఆదాయాల పరంగా IPL కంటే ముందుంది. దీంతో పాటు దేశవాళీ క్రికెటర్ల కోసం కూడా షా ఎన్నో మంచి పనులు చేశాడు. డిసెంబర్ 2019లో భవిష్యత్ ఐసీసీ CEC సమావేశాలకు BCCI తన ప్రతినిధిగా షాను ఎంపిక చేసింది. అతను ఏప్రిల్ 2022లో ఐసీసీ బోర్డు సభ్య ప్రతినిధిగా కూడా నియమితుడయ్యాడు. 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చారు. ఇందులో కూడా షా ముఖ్య పాత్ర పోషించాడు. జగ్‌మోహన్ దాల్మియా (1997-2000), శరద్ పవార్ (2010-2012), ఎన్ శ్రీనివాసన్ (2014-2015), శశాంక్ మనోహర్ (2015-2020) తర్వాత ఐసిసి అధ్యక్షుడైన భారతీయుడుగా షా నిలవనున్నారు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close