Trending news

FEMA violation case: డీఎంకే ఎంపీకి షాక్.. రూ.908 కోట్లు జరిమానా

[ad_1]

  • డీఎంకే ఎంపీకి ఈడీ షాక్.

  • రూ 908 కోట్లు జరిమానా
FEMA violation case: డీఎంకే ఎంపీకి షాక్.. రూ.908 కోట్లు జరిమానా

తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ ఎస్.జగద్రక్షకన్‌కు ఈడీ షాకిచ్చింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ కేసులో ఆయనకు, ఆయన కుటుంబానికి రూ.908 కోట్ల జరిమానా విధించింది. ఫెమా చట్టంలోని సెక్షన్ 37ఏ కింద 2020 సెప్టెంబర్‌లో సీజ్ చేసిన రూ.89.19 కోట్ల మొత్తాన్ని కూడా జప్తు చేసినట్టు తెలిపింది. ఆగస్టు 26న వెల్లడించిన తీర్పు ప్రకారం ఈ జరిమానా విధించినట్టు ఈడీ తెలిపింది.

జగద్రక్షకన్ (76) డీఎంకే టిక్కెట్‌పై అరక్కోణం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. చెన్నై బేస్ట్ అకార్డ్ గ్రూప్‌కు వ్యవస్థాపకుడుగా ఉన్నారు. ఆయనకు సొంతంగా భరత్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌‌ (BIHER) ఉంది. జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులపై సంబంధిత కంపెనీపై ఫెమా ఉల్లంఘన కింద 2021 డిసెంబర్ 1న ఈడీ కేసు నమోదు చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి 2017లో సింగపూర్‌లోని ఒక షెల్ కంపెనీలో రూ.42 కోట్లు వారు పెట్టుబడి పెట్టినట్టు ఈడీ విచారణలో తేలింది.

2007లో తన కంపెనీకి అక్రమంగా బొగ్గు కేటాయింపులు జరిగాయని ఆరోపిస్తూ 2012లో తమిళనాడులో జరిగిన బొగ్గు కుంభకోణంలో కూడా ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత, అతని వైద్య కళాశాల MBBS విద్యార్థుల నుండి పెంచిన ఫీజులను డిమాండ్ చేస్తున్నట్లు స్టింగ్ ఆపరేషన్ కూడా బట్టబయలు చేసింది.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close