Trending news

ఐపీఎల్‌ చరిత్రో ఒకే జట్టు తరపున ఆడిన ఐదుగురు భారత ఆటగాళ్లు.. లిస్ట్ చూస్తే షాకే..

[ad_1]

Indian players played for one Franchise in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన T20 లీగ్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ హోదాను కూడా కలిగి ఉంది. ప్రతి దేశంలోని యువ, వెటరన్ ఆటగాళ్లు ఇందులో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఎంపిక చేసిన కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే అవకాశం లభిస్తుంది.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 17 సీజన్లలో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ కాలంలో, కొంతమంది భారతీయ ఆటగాళ్లు ఒకే జట్టు కోసం ఆడటం కనిపించింది. ఎక్కువ ధర పలికినా తన జట్టును విడిచిపెట్టే ఆలోచన చేయలేదు. ఈ లిస్టులో ఐపీఎల్‌లో ఒకే జట్టు కోసం ఆడిన ఐదుగురు భారతీయ ఆటగాళ్లను ఇక్కడ చూద్దాం..

5. పృథ్వీ షా..

యువ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా సారథ్యంలో 2018లో అండర్-19 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించాడు. ఆ సంవత్సరం జరిగిన IPL వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతను ఇప్పటికీ DC జట్టులో భాగమే. అతని కెరీర్‌లో 79 మ్యాచ్‌లు ఆడాడు. 23.95 సగటుతో 1892 పరుగులు చేశాడు.

4. రిషబ్ పంత్..

భారత జట్టు వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా చాలా కాలంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఢిల్లీ 2016లో రిషబ్ పంత్‌ను తమ జట్టులో చేర్చుకుంది. ఇప్పటి వరకు అతను ఈ ఫ్రాంచైజీని విడిచిపెట్టలేదు. ఇప్పటి వరకు 111 మ్యాచ్‌లు ఆడిన పంత్ 3284 పరుగులు చేశాడు.

3. సచిన్ టెండూల్కర్..

గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్ తన IPL కెరీర్‌లో ముంబై ఇండియన్స్ తరపున మాత్రమే ఆడాడు. అతని IPL కెరీర్ 6 సంవత్సరాలు కొనసాగింది. టెండూల్కర్ 78 మ్యాచ్‌లు ఆడి 34.84 సగటుతో 2334 పరుగులు చేశాడు.

2. జస్ప్రీత్ బుమ్రా..

భారత జట్టు ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఐపీఎల్‌లో చూడొచ్చు. మెగా వేలంలో బుమ్రా జట్టులోకి వస్తాడని ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. కానీ ముంబై ఇప్పటికే అతనిని ఉంచుకుంది. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ తన IPL కెరీర్‌ను 2013లో MI కోసం ఆడటం ప్రారంభించాడు. ఇప్పటికీ జట్టులో భాగమే.

1. విరాట్ కోహ్లీ..

ఐపీఎల్ ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలో భాగమయ్యాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తప్ప మరే ఇతర ఫ్రాంచైజీ తరపున ఆడనని కింగ్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిటే నమోదైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

[ad_2]

Related Articles

Back to top button
Close
Close